ఆఖరి స్థానంలో ఆనంద్‌

17 Aug, 2018 04:03 IST|Sakshi

సెయింట్‌ లూయిస్‌: ప్రపంచ మాజీ చాంపియన్, భారత చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌కు సెయింట్‌ లూయిస్‌ ర్యాపిడ్, బ్లిట్జ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో నిరాశ ఎదురైంది. గురువారం ముగిసిన ఈ టోర్నీలో ఆనంద్‌ 13.5 పాయింట్లు సాధించాడు. పది మంది పాల్గొన్న ఈ టోర్నీలో పదో స్థానంలో నిలిచాడు. తొలి రౌండ్‌లో అమెరికాకు చెందిన హికరు నకమురపై గెలిచిన అనంతరం ఆనంద్‌ మరో గెలుపును అందుకోలేకపోయాడు. అయితే నకముర (22.5) టోర్నీ విజేతగా నిలవడం విశేషం.  

మరిన్ని వార్తలు