ఆనంద్‌కు మరో ‘డ్రా’

27 Mar, 2014 01:11 IST|Sakshi

ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఎనిమిదో ‘డ్రా’ నమోదు చేశాడు. వ్లాదిమిర్ క్రామ్నిక్ (రష్యా)తో బుధవారం జరిగిన 11వ రౌండ్ గేమ్‌ను ఆనంద్ 31 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు.
 
 ఈ రౌండ్ తర్వాత ఆనంద్ ఏడు పాయింట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. ఆంద్రికిన్ (రష్యా)-మమెదైరోవ్ (అజర్‌బైజాన్) గేమ్ 46 ఎత్తుల్లో; పీటర్ స్విద్లెర్ (రష్యా)-అరోనియన్ (అర్మేనియా) గేమ్ 33 ఎత్తుల్లో; తొపలోవ్ (బల్గేరియా)-కర్జాకిన్ (రష్యా) గేమ్ 57 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి.
 

మరిన్ని వార్తలు