విశ్వనాథన్‌ ఆనంద్‌ ‘మైండ్‌మాస్టర్‌’ విడుదల

14 Dec, 2019 02:32 IST|Sakshi

చెన్నై: భారత సూపర్‌ గ్రాండ్‌మాస్టర్, ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌ అయిన విశ్వనాథన్‌ ఆనంద్‌ రాసిన ‘మైండ్‌ మాస్టర్‌’ పుస్తకం శుక్రవారం విడుదలైంది. ఇక్కడ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ‘ది హిందు’ పబ్లిషింగ్‌ గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌.రామ్‌ లాంఛనంగా ఆ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆనంద్‌ మాట్లాడుతూ ‘మీరు చెస్‌ రొమాంటిక్‌ అయితే ఈ ఆట అందాన్ని ఆస్వాదిస్తారు. ఈ కంప్యూటర్ల యుగంలోనూ చెస్‌ ఆట అనుభూతే వేరు. కంప్యూటర్లు కూడా అంతే అనంతమైన సాధ్యాల్ని సాకారం చేస్తాయి’ అని అన్నాడు. తన పుస్తకంలో చెస్‌ గడులతో పాటు కంప్యూటర్‌కూ చోటిచ్చానని దీంతో ఎలాంటి మార్పులు సంభవించాయో పేర్కొన్నట్లు చెప్పాడు.  

మరిన్ని వార్తలు