తాల్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నీ విజేత ఆనంద్‌

5 Mar, 2018 05:00 IST|Sakshi
విశ్వనాథన్‌ ఆనంద్‌

భారత చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ ఈ ఏడాది తొలి అంతర్జాతీయ టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. మాస్కోలో జరిగిన ప్రతిష్టాత్మక తాల్‌ స్మారక టోర్నమెంట్‌లో 48 ఏళ్ల ఆనంద్‌ ర్యాపిడ్‌ విభాగంలో చాంపియన్‌గా నిలిచాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య లీగ్‌ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో ఆనంద్‌ తొమ్మిది రౌండ్‌లకుగాను ఆరు పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. నాలుగు గేముల్లో గెలిచి, మరో నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న ఆనంద్‌ ఒక గేమ్‌లో ఓడిపోయాడు. 

మరిన్ని వార్తలు