24న వైజాగ్‌లో వన్డే 

4 Oct, 2018 01:45 IST|Sakshi

 ఇండోర్‌ నుంచి మ్యాచ్‌ తరలింపు  

ముంబై: భారత్, వెస్టిండీస్‌ మధ్య రెండో వన్డే నిర్వహణకు సంబంధించి మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘంలో చెలరేగిన వివాదం విశాఖపట్నం అభిమానులకు కలిసొచ్చి ంది. ఈ నెల 24న ఇండోర్‌లోని హోల్కర్‌ స్టేడియంలో మ్యాచ్‌ జరగాల్సి ఉండగా... కాంప్లిమెంటరీ పాస్‌ల గొడవ ఎంతకీ తేలకపోవడంతో వేదికను మార్చాలని బీసీసీఐ నిర్ణయించింది.

ఈ మ్యాచ్‌ను అదే తేదీన విశాఖపట్నంలో నిర్వహిస్తున్నట్లు బోర్డు బుధవారం అధికారికంగా ప్రకటించింది. వైజాగ్‌లోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం ఇప్పటి వరకు 7 వన్డేలకు ఆతిథ్యమిచ్చింది.   

మరిన్ని వార్తలు