వైదొలగిన టెర్రీ వాల్ష్

18 Nov, 2014 17:16 IST|Sakshi
వైదొలగిన టెర్రీ వాల్ష్

న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు చీఫ్ కోచ్ టెర్రీ వాల్ష్ మంగళవారం రాజీనామా చేశారు. తన కాంట్రాక్టుపై స్పోర్ట్స్అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్), హాకీ ఇండియాతో జరిగిన చర్చలు విఫలం కావడంతో కోచ్ పదవిని వాల్ష్ వదులుకున్నారు. ఆయన కాంట్రాక్టు రేపటితో ముగియనుంది.

గత నెల 19నే వాల్ష్ రాజీనామా సమర్పించి తర్వాత మనసు మార్చుకున్నారు. తన నియమ నిబంధనలకు లోబడి కొత్త ఒప్పందం కుదుర్చుకుంటే పదవిలో కొనసాగే విషయాన్ని పునఃపరిశీలిస్తానని వాల్ష్ ఇంతకుముందు ప్రకటించారు. అయితే చర్చలు విఫలం కావడంతో కోచ్ పదవి నుంచి వాల్ష్ వైదొలగారు.

మరిన్ని వార్తలు