టెన్‌పిన్‌ బౌలింగ్‌ క్రీడను ప్రోత్సహిస్తాం

11 Jul, 2019 14:02 IST|Sakshi

రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ వ్యాఖ్య

హైదరాబాద్‌: రాష్ట్రంలో టెన్‌పిన్‌ బౌలింగ్‌ను మరింత ప్రోత్సహించడానికి  టెన్‌పిన్‌ బౌలింగ్‌ సంఘంను ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. పబ్లిక్‌ ,ప్రైవేట్‌ భాగస్వామ్య పద్ధతిలో అన్నిరకాల క్రీడలను ప్రోత్సహించడానికి కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. బంజారాహిల్స్‌ పార్క్‌హయత్‌ హోటల్‌లో బుధవారం టెన్‌పిన్‌ బౌలింగ్‌ అసోసియేషన్‌ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా అసోసియేషన్‌ అధ్యక్షుడు రాహుల్‌రెడ్డి మాట్లాడుతూ అత్యంత కచ్చితత్వంతో కూడిన ఈ క్రీడలో ఔత్సాహికులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ సం«స్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బౌలింగ్‌ సమాఖ్యకు అనుబంధంగా పనిచేస్తున్నామని అన్నారు. ఆగస్టు నుంచి పలు పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర రెడ్డి, అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి విజయకృష్ణ దాసరి, కమిటీ సభ్యులు, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు