అఫ్గాన్‌ ఒక్క టెస్టు మ్యాచ్‌ గెలిస్తే చాలు: ధావన్‌

16 Jun, 2018 10:58 IST|Sakshi

బెంగళూరు: అఫ్గానిస్తాన్‌ టెస్టు తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని భారత ఓపెనర్ శిఖర్ ధావన్ సూచించాడు. బెంగళూరు వేదికగా భారత్, అఫ్గానిస్తాన్‌ జట్ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌ రెండు రోజుల్లోనే ముగిసిన విషయం తెలిసిందే. ఈ టెస్టులో శిఖర్ ధావన్, మురళీ విజయ్ శతకాలు సాధించగా.. బౌలింగ్‌లో అశ్విన్, జడేజా చెలరేగడంతో అఫ్గానిస్థాన్ జట్టు ఇన్నింగ్స్, 262 పరుగుల భారీ తేడాతో భారత్ చేతిలో ఓడిపోయింది.

మ్యాచ్‌ తర్వాత ధావన్‌ మాట్లాడుతూ.. ‘క్రికెట్‌లో అఫ్గానిస్తాన్‌ ఈ స్థాయికి వచ్చినందుకు నేను అభినందిస్తున్నా. ఆ జట్టు తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ప్రత్యర్థి జట్టుతో ఆడి ఓసారి అఫ్గానిస్థాన్ విజయం సాధిస్తే చాలు.. ఆటోమేటిక్‌గా ఆ జట్టులో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇప్పటికే భారత జట్టుతో టెస్టు ఆడటం ఆ జట్టులో కచ్చితంగా ఉత్సాహం నింపేదే. మ్యాచ్‌ని చూసేందుకు వచ్చిన అభిమానులకి  ధన్యవాదాలు. ఇక మ్యాచ్‌ రెండు రోజుల్లోనే ముగియడంతో ఐర్లాండ్‌ పర్యటనకు ముందు భారత జట్టుకి ఎక్కువ విశ్రాంతి లభించనుంది’ అని ధావన్ వెల్లడించాడు.

మరిన్ని వార్తలు