'ఫాస్ట్ బౌలర్లే మా ఆయుధం'

28 Sep, 2015 20:39 IST|Sakshi
'ఫాస్ట్ బౌలర్లే మా ఆయుధం'

న్యూఢిల్లీ:  ప్రధానంగా స్పిన్నర్లను సమర్ధవంతంగా ఎదుర్కొనే టీమిండియా జట్టును కట్టడి చేయడానికి తమ సీమర్లపైనే నమ్మకం పెట్టుకున్నట్లు దక్షిణాఫ్రికా కోచ్ రస్సెల్ డొమినగో స్పష్టం చేశాడు. తమ జట్టులో ఇమ్రాన్ తహీర్ తో పాటు మరో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నా.. సీమ్ పైనే తమ విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయన్నాడు. డేల్ స్టెయిన్, మోర్నీ మోర్కల్ తో తమ జట్టు సీమ్ బౌలింగ్ లో  చాలా పటిష్టంగా ఉందన్నాడు.

 

'టీమిండియా స్పిన్నర్లను బాగా ఎదుర్కొంటుంది. ఆ విషయం మాకు బాగా తెలుసు. దక్షిణాఫ్రికా ఎప్పుడూ భారత పర్యటనకు వచ్చినా.. స్పిన్ బౌలర్ల కంటే ఫాస్ట్ బౌలర్లే రాణించారు. అయినప్పటికీ ఈ సిరీస్ లో స్పిన్ బౌలింగ్ కూడా కీలకంగా మారే అవకాశం ఉంది' అని రస్సెల్ స్పష్టం చేశాడు.

మరిన్ని వార్తలు