మార్లన్ శామ్యూల్స్ (104 బంతుల్లో 106 నాటౌట్; 9 ఫోర్లు; 4 సిక్స్) మరోసారి నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. అజేయ శతకంతో రెచ్చిపోవడంతో పాకిస్థాన్తో ఆదివారం జరిగిన నాలుగో వన్డేలో వెస్టిండీస్ 49 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. మ్యాచ్ ఆరంభానికి ముందు వర్షం ఆటంకం కలిగించడంతో మ్యాచ్ను 49 ఓవర్లకు కుదించారు.
63 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన జట్టును శామ్యూల్స్ ఆదుకున్నాడు. ఓపెనర్గా వరుసగా విఫలమవుతున్న క్రిస్ గేల్ (46 బంతుల్లో 30; 3 ఫోర్లు; 1 సిక్స్) ఈ మ్యాచ్లో మిడిలార్డర్లో దిగి ఫర్వాలేదనిపించుకున్నాడు. వీరిద్దరూ జాగ్రత్తగా ఆడి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు.
29వ ఓవర్లో ఆఫ్రిది గేల్ వికెట్ తీయడంతో నాలుగో వికెట్కు 57 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం సిమ్మన్స్ (44 బంతుల్లో 46; 5 ఫోచర్లు; 1 సిక్స్) వేగంగా ఆడితో చెలరేగి పరుగుల వేగాన్ని పెంచాడు. దీంతో ఐదో వికెట్కు 95 పరుగులు చేరాయి. చివర్లో మరింత దూకుడును ప్రదర్శించిన శామ్యూల్స్ 48.5 ఓవర్లో శతకాన్ని అందుకుని చిట్టచివరి బంతిని సిక్స్గా మలచడంతో జట్టుకు మంచి స్కోరు అందింది.