'2016 టి-20 ప్రపంచ కప్ మావాళ్లదే'

9 Aug, 2015 15:35 IST|Sakshi

బ్రిడ్జిటౌన్ (బార్బడోస్): వచ్చే ఏడాది జరిగే టి-20 ప్రపంచ్ కప్ను వెస్టిండీస్ గెలుస్తుందని, ఆ జట్టు మాజీ పేసర్ కొలిన్ క్రోఫ్ట్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా విండీస్ విజయం పలు నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఈ మెగా టోర్నీలో కరీబియన్లు కప్ కైవసం చేసుకోవాలంటే తగిన ప్రణాళిక, పటిష్టమైన జట్టు ఎంపికచేయడం అవసరమని, ఇవి కీలక అంశాలను క్రోఫ్ట్ అభిప్రాయపడ్డాడు.

టి-20 ర్యాంకింగ్స్లో విండీస్ ప్రస్తుతం నాలుగో ర్యాంక్లో ఉంది. శ్రీలంక, ఆస్ట్రేలియా, భారత్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. కాగా ఈ ఫార్మాట్లో విండీస్ నెంబర్ వన్ అవుతుందని క్రోఫ్ట్ ధీమా వ్యక్తం చేశాడు. వచ్చే ఏడాది మార్చి 11 నుంచి భారత్లో టి-20 ప్రపంచ కప్ను నిర్వహించనున్నారు. శ్రీలంక డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనుంది.

మరిన్ని వార్తలు