టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌

6 Nov, 2018 18:47 IST|Sakshi

లక్నో:  భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో వెస్టిండీస్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఇప్పటికే ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టీ-20లో భారత్ విజయం సాధించి సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని విండీస్ భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగుతున్నాయి. భారత జట్టులో ఉమేష్ యాదవ్‌కు బదులుగా భువనేశ్వర్ కుమార్ ఆడుతుండగా, వెస్టిండీస్ జట్టులో నికోలస్ పూరన్ చేరాడు. 

జట్ల వివరాలు :

వెస్టిండీస్: షై హోప్, దెనెష్ రామ్‌దిన్(కీపర్), షిమ్రన్ హెట్మేర్, కీరన్ పొలార్డ్, డర్రెన్ బ్రావో, నికోలస్ పూరన్, కరోల్స్ బ్రాత్‌వైట్(కెప్టెన్), ఫబైన్ అలెన్, కీమో పాల్, ఖార్రే పిర్రే, ఓషెన్ థామస్.
 
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధవన్, లోకేశ్ రాహుల్, రిషబ్ పంత్, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్(కీపర్), కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్.

మరిన్ని వార్తలు