కోహ్లి ప్రస్తుతం బెంగళూరు కెప్టెన్. కానీ ఐపీఎల్ తొలి మూడు సీజన్లలో మాత్రం తనో మామూలు కుర్రాడు. అప్పట్లో స్టార్స్తో నిండిన జట్టులో 5-6 స్థానాల్లో ఆడించేవారు. దీంతో విసిగిపోయి తనని జట్టులోంచి తీసేయమని అడిగాడట. ‘మీరు ఆడిస్తున్న స్థానాల్లో నేనేమాత్రం రాణించలేను. టాపార్డర్లో ఆడించేట్లయితే తుది జట్టులో ఉంచండి’ అని 2011 సీజన్కు ముందు కోహ్లి అడిగాడు. ఆ సీజన్ నుంచి కోహ్లి బెంగళూరుకు వెన్నెముకగా మారాడు.