ప్లే ఆఫ్లో ఎవరితో ఎవరు?

23 May, 2016 00:39 IST|Sakshi
ప్లే ఆఫ్లో ఎవరితో ఎవరు?

రాయ్పూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ పేరుతో ప్రేక్షకులకు, వీక్షకులకు గట్టి మజా అందించిన పొట్టి క్రికెట్ పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. ఆదివారం నాటి మ్యాచ్ లతో లీగ్స్ రౌండ్ ముగిసింది. మంగళవారం నుంచి మొదలయ్యే ప్లే ఆఫ్స్ కు గుజరాత్ లయన్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్, సన్ రైజర్స్  హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు అర్హత సాధించాయి. పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిచిచిన గుజరాత్, బెంగళూరులు 24న జరిగే మొదటి క్వాలిఫయర్ లో పోటీపడతాయి.

ఇందులో నెగ్గిన జట్టు నేరుగా ఫైనల్స్ కు వెళుతుంది. ఓడిన జట్టు ఎలిమినేటర్ 1లో విన్ అయిన టీమ్ తో తలపడుతుంది. 25న జరగనున్న తొలి ఎలిమినేటర్ లో  హైదరాబాద్, కోల్ కతాలు తలపడతాయి. 27న క్వాలిఫయర్ 2 జరుగుతుంది. 29 ఆదివారం ఫైనల్స్ జరుగుతుంది. ఇక ముందు జరిగే మ్యాచ్ లు అన్ని రాత్రి 8 గంటలకే ప్రారంభం అవుతాయి. లీగ్స్ ముగిసిన తర్వాత పాయింట్ల పట్టిక, ప్లే ఆఫ్ షెడ్యూల్ ఇలా ఉన్నాయి..

 

 

మరిన్ని వార్తలు