విలియమ్సన్ సెంచరీ

24 May, 2015 01:38 IST|Sakshi

లార్డ్స్: కేన్ విలియమ్సన్ సెంచరీ (262 బంతుల్లో 132; 15 ఫోర్లు) సహాయంతో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజి లాండ్ జట్టు 134 పరుగుల ఆధిక్యం సాధించింది. శనివారం మూడో రోజు తమ తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 523 పరుగులకు ఆలౌటైంది. టేలర్ (62; 7 ఫోర్లు), వాట్లింగ్ (61 నాటౌట్; 11 ఫోర్లు) రాణించారు. బ్రాడ్, వుడ్, మొయిన్ అలీలకు మూడేసి వికెట్లు దక్కాయి. అనంతరం తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి  26 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. కుక్ (32 బ్యాటింగ్), బెల్ (29 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు.

మరిన్ని వార్తలు