విండీస్‌ మెరిసె...

18 Sep, 2017 00:46 IST|Sakshi

చెస్టర్‌ లె స్ట్రీట్‌: ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టి20 మ్యాచ్‌లో విండీస్‌ జట్టు 21 పరుగుల తేడాతో గెలిచింది. ఎవిన్‌ లూయిస్‌ (28 బంతుల్లో 51; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), క్రిస్‌ గేల్‌ (21 బంతుల్లో 40; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో... విండీస్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 176 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో గేల్‌ అంతర్జాతీయ టి20ల్లో 100 సిక్సర్లు కొట్టిన తొలి క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు.

ఆ తర్వాత ఇంగ్లండ్‌ 19.3 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. హేల్స్‌ (17 బంతుల్లో 43; 8 ఫోర్లు, 1 సిక్స్‌) ఒక్కడే ఆకట్టుకున్నాడు. బ్రాత్‌వైట్, విలియమ్స్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. 

>
మరిన్ని వార్తలు