20 నుంచి మహిళల క్రికెట్ సెలక్షన్స్

17 Sep, 2016 10:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ మహిళల క్రికెట్ జట్టు కోసం ఈనెల 20 నుంచి సెలక్షన్స్ ప్రారంభం కానున్నాయి. సికింద్రాబాద్‌లోని మారేడ్‌పల్లి ప్లేగ్రౌండ్‌‌సలో మూడు రోజుల పాటు ఈ ఎంపిక పోటీలు జరుగుతాయి. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు సౌత్‌జోన్ యూనివర్సిటీ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనే ఓయూ జట్టుకు ఎంపికవుతారు.

 

మరిన్ని వార్తలు