భారత జట్లలో కల్పన, అంజలి, అరుంధతి

24 Dec, 2019 00:56 IST|Sakshi

మహిళల టి20 చాలెంజర్‌ ట్రోఫీ

ముంబై: సీనియర్‌ మహిళల టి20 చాలెంజర్‌ ట్రోఫీలో పాల్గొనే భారత ‘ఎ’... ‘బి’... ‘సి’ జట్లను సోమవారం ప్రకటించారు. ఈ టోర్నీ జనవరి 4 నుంచి 11 వరకు కటక్‌లో జరుగుతుంది. భారత ‘బి’ జట్టులో ఆంధ్ర అమ్మాయిలు రావి కల్పన, అంజలి శర్వాణిలకు స్థానం లభించగా... భారత ‘సి’ జట్టులో హైదరాబాద్‌ అమ్మాయి అరుంధతి రెడ్డి ఎంపికైంది. భారత ‘ఎ’ జట్టుకు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌... ‘బి’ జట్టుకు స్మృతి మంధాన... ‘సి’ జట్టుకు వేద కృష్ణమూర్తి సారథ్యం వహిస్తారు.

మరిన్ని వార్తలు