'పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కంటే మెరుగ్గా ఆడాలి'

21 Feb, 2015 09:35 IST|Sakshi
'పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కంటే మెరుగ్గా ఆడాలి'

*ప్రాక్టీస్‌లో భారీ షాట్ల ప్రాక్టీస్


 మెల్‌బోర్న్: దక్షిణాఫ్రికాతో మ్యాచ్ అంటే కచ్చితంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కంటే మెరుగ్గా ఆడాలి. మరింత భారీ స్కోరు చేయాలి. భారత జట్టు ప్రాక్టీస్ సెషన్ కూడా ఈ దిశగానే సాగుతోంది. శుక్రవారం జరిగిన సెషన్‌లో భారత బ్యాట్స్‌మన్ అంతా భారీ షాట్లు ఆడటం ప్రాక్టీస్ చేశారు. సెయింట్ కిల్డాలోని జంక్షన్ ఓవల్ మైదానంలో జరిగిన సెషన్‌లో... ఒక నెట్‌ను పూర్తిగా స్పిన్నర్ల బౌలింగ్‌కు వదిలేశారు.

రైనా, అక్షర్ పటేల్‌లతో బంతులు వేయించి... భారీ షాట్లు బాదారు. కొత్త హెయిర్ స్టైల్ ‘మొహక్’తో ఆకట్టుకున్న విరాట్ అందరికంటే జోరుగా బంతిని కొట్టాడు. తర్వాత ధోని, రోహిత్ కూడా అదే నెట్‌లో ప్రాక్టీస్ చేశారు. దక్షిణాఫ్రికా జట్టులో స్పిన్నర్ తాహిర్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొని, ఎదురుదాడి చేయడం భారత మిడిలార్డర్ క్రికెటర్ల వ్యూహంగా కనిపిస్తోంది.
 
 ఇక బౌలింగ్ విషయానికొస్తే అశ్విన్, భువనేశ్వర్ ఫిట్‌నెస్‌తో ఉన్నారని టీమ్ మేనేజ్‌మెంట్ ప్రకటించింది. అయితే భువనేశ్వర్ శుక్రవారం కూడా నెట్స్‌లో పెద్దగా ఆకట్టుకోలేదు. అక్షర్ పటేల్ బ్యాటింగ్ చేస్తుండగా కొన్ని షార్ట్ బంతులు వేశాడు. కానీ బంతుల్లో ఎక్కడా వేగం కనిపించలేదు.
 

మరిన్ని వార్తలు