ఐసీసీ వరల్డ్‌ కప్‌ 2019 : సెమీస్‌ రేసులో ఎవరంటే..

1 Jul, 2019 09:21 IST|Sakshi

లండన్‌ : ఆస్ట్రేలియా 14 పాయింట్లతో ఇప్పటికే సెమీస్‌ చేరగా... రేపు బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్‌ గెలిస్తే 13 పాయింట్లతో సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంటుంది. ఒకవేళ భారత్‌ ఓడినా 11 పాయింట్లతో సెమీఫైనల్‌ రేసులో నిలుస్తోంది. ఇంగ్లండ్‌ జూలై 3న జరిగే తమ చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా 12 పాయింట్లతో సెమీస్‌ చేరుతుంది. న్యూజిలాండ్‌ చేతిలో ఇంగ్లండ్‌ ఓడిపోయి... బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్‌ గెలిస్తే ఆ జట్టు 11 పాయింట్లతో సెమీస్‌ బెర్త్‌ దక్కించుకుంటుంది. భారత్, పాకిస్తాన్‌లపై నెగ్గడంతోపాటు రన్‌రేట్‌ మెరుగైతేనే బంగ్లాదేశ్‌కు సెమీస్‌ చాన్స్‌ ఉంది.  ఇక భారత్‌పై ఇంగ్లండ్‌ గెలవడంతో శ్రీలంక జట్టు సెమీఫైనల్‌ ఆశలు ఆవిరయ్యాయి. చదవండి: తగిలింది తొలి షాక్‌  

మరిన్ని వార్తలు