వరల్డ్‌కప్‌లో మరో మ్యాచ్‌ వర్షార్పణం

10 Jun, 2019 21:00 IST|Sakshi

సౌతాంప్టన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో వర్షం కారణంగా మరో మ్యాచ్‌ రద్దయ్యింది. మూడు రోజుల క్రితం శ్రీలంక-పాకిస్తాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కాగా, తాజాగా దక్షిణాఫ్రికా-వెస్టిండీస్‌ జట్ల జరగాల్సిన మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. దక్షిణాఫ్రికా 7.3 ఓవర్లలో 29/2 వద్ద ఉండగా వర్షం పడటంతో మ్యాచ్‌ నిలిచిపోయింది. ఆ తర్వాత మ్యాచ్‌ జరపడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఓ దశలో వర్షం వెలిసి కవర్లు తొలిగించే క్రమంలో మరొకసారి వరుణుడు అంతరాయం కల్గించాడు. కనీసం 20 ఓవర్ల మ్యాచ్‌ జరపాలకున్నప్పటికీ అది సాధ్యం కాలేదు. చివరకు భారత కాలమానప్రకారం రాత్రి గం.8.50 ని.ల​కు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. మ్యాచ్‌ రద్దు కావడంతో ఇరు జట్లకు తలో పాయింట్‌ లభించింది.


 

మరిన్ని వార్తలు