సుశీల్‌కు ఇంకా అవకాశం ఉంది

13 May, 2016 01:02 IST|Sakshi
సుశీల్‌కు ఇంకా అవకాశం ఉంది

తేల్చిన భారత రెజ్లింగ్ సమాఖ్య
ప్రాబబుల్స్ జాబితాలో లేని రెజ్లర్ పేరు


న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌కు క్రీడాకారుల అక్రిడిటేషన్ కోసం భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)కు వచ్చిన రెజ్లర్ల జాబితాలో సుశీల్ కుమార్ పేరు లేకపోవడం సంచలనం రేపింది. 74 కేజీల విభాగంలో రియోకు ఎవరు వెళ్లాలనే విషయంపై సుశీల్, నర్సిం గ్‌ల మధ్య వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఐఓఏకు వచ్చిన జాబితాలో సుశీల్ పేరు లేదు. అయితే ఈ జాబితాను తాము పంపలేదని, సుశీల్‌కు అవకాశం ఉందని భారత రెజ్లింగ్ సమాఖ్య పంపింది. ‘ఒలింపిక్స్‌కు అర్హత పొందిన రెజ్లర్ల పేర్లను ప్రపంచ రెజ్లింగ్ సంఘం ఐఓఏకు పంపుతుంది.

ఇది ప్రతిసారీ జరిగే ప్రక్రియ. అయితే ఏ విభాగంలో ఎవరు పాల్గొనాలో మా సమాఖ్య నిర్ణయించిన తర్వాత ఆ పేర్లను ఐఓఏ ఆమోదిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి దీనిపై వివాదం అవసరం లే దు’ అని భారత రెజ్లింగ్ సమాఖ్య పేర్కొంది. మరోవైపు రె జ్లర్ల వివాదంతో తాము ఎలాంటి జోక్యం చేసుకోబోమని కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

>
మరిన్ని వార్తలు