రెజ్లర్‌ రవి కుమార్‌కు రజతం

19 Nov, 2018 01:59 IST|Sakshi

ప్రపంచ అండర్‌–23 రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్‌ రవి కుమార్‌ రజత పతకంతో సంతృప్తి పడ్డాడు. రొమేనియాలోని బుకారెస్ట్‌లో జరిగిన ఈ మెగా ఈవెంట్‌లో పురుషుల ఫ్రీస్టయిల్‌ 57 కేజీల విభాగం ఫైనల్లో రవి 0–6తో జపాన్‌కు చెందిన తొషిహిరో హసెగవా చేతిలో ఓడిపోయాడు. ఈ ఈవెంట్‌ చరిత్రలో పతకం నెగ్గిన మూడో భారతీయ రెజ్లర్‌గా రవి గుర్తింపు పొందాడు. 2017లో బజరంగ్‌ పూనియా (65 కేజీలు), ఓంప్రకాశ్‌ (70 కేజీలు) కూడా రజత పతకాలే సాధించారు.    

మరిన్ని వార్తలు