యశస్విని సింగ్‌ పసిడి గురి...

1 Sep, 2019 05:54 IST|Sakshi
యశస్విని సింగ్‌

ప్రపంచ కప్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు మూడో స్వర్ణ పతకం లభించింది. బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరుగుతున్న ఈ ఈవెంట్‌లో శనివారం మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో భారత అమ్మాయి యశస్విని సింగ్‌ స్వర్ణం సాధించింది. ఫైనల్లో యశస్విని 236.7 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. అదే క్రమంలో భారత్‌కు ఈ విభాగంలో టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ను అందించింది. ఒలీనా (ఉక్రెయిన్‌–234.8 పాయింట్లు) రజతం, జాస్మీనా (సెర్బియా –215.7 పాయింట్లు) కాంస్యం గెలిచారు. ఈ టోర్నీలో భారత్‌కు ఇలవేనిల్, అభిషేక్‌ వర్మ స్వర్ణాలు అందించారు.  

మరిన్ని వార్తలు