యు ముంబా డబుల్ హ్యాట్రిక్

26 Feb, 2016 00:14 IST|Sakshi
యు ముంబా డబుల్ హ్యాట్రిక్

న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్‌లో యు ముంబా జట్టు దూకుడు కనబరుస్తోంది. గురువారం బెంగళూరు బుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 39-18తో ఘనవిజయం సాధిం చింది. ఈ జట్టుకు ఇది  వరుసగా ఆరో విజయం కావడం విశేషం. దీంతో ఆడిన పది మ్యాచ్‌ల్లో ఎనిమిది విజయాలందుకున్న ముంబా 40 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. ప్రథమార్ధంలో 16-5తో ఆధిక్యంలో ఉన్న ముంబాకు ఆ తర్వాత కూడా ప్రత్యర్థి నుంచి ఎలాంటి అడ్డంకి ఎదురుకాలేదు. కెప్టెన్ అనూప్ కుమార్, రిశాంక్ దేవడిగ ఆరేసి రైడింగ్ పాయింట్లు సాధించారు. బెంగళూరు నుంచి పవన్ కుమార్ నాలుగు రైడింగ్ పాయింట్లు సాధించాడు.

పట్నా జోరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో తమ అగ్రస్థానాన్ని పట్నా పైరేట్స్ జట్టు మరింత పటిష్టం చేసుకుంది. ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడిన ఈ జట్టు... గురువారం దబాంగ్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 67-34 తేడాతో తిరుగులేని విజయాన్ని అందుకుంది. లీగ్‌లో అట్టడుగున ఉన్న ఢిల్లీ ఆటగాళ్లు ఏస్థాయిలోనూ ఆకట్టుకోలేకపోయారు. ప్రారంభం నుంచే చెలరేగిన పట్నా ఆటగాళ్లు వరుసగా పాయింట్లు సాధిస్తూ ఢిల్లీపై పైచేయి సాధించారు. దీంతో ప్రథమార్ధం ముగిసే సరికి 37-17తో జోరు మీదుంది. పట్నా తరఫున కెప్టెన్ రోహిత్ కుమార్ అత్యధికంగా 15 రైడ్ పాయింట్లు సాధించగా ఢిల్లీ జట్టులో సుర్జీత్ సింగ్ 12 రైడ్ పాయింట్లు సాధించాడు.

 

మరిన్ని వార్తలు