యు ముంబా సిక్సర్‌

4 Nov, 2018 03:05 IST|Sakshi

గ్రేటర్‌ నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్‌లో యు ముంబా జట్టు ఆరో విజయం సొంతం చేసుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 31–22తో పుణేరీ పల్టన్‌పై గెలుపొందింది. యు మంబా తరఫున అభిషేక్‌ సింగ్‌ 7 రైడ్‌ పాయింట్లు, ట్యాక్లింగ్‌లో సురేందర్‌ సింగ్‌ (4 పాయింట్లు) ఆకట్టుకున్నారు. పుణేరీ తరఫున అక్షయ్‌ జాధవ్‌ 5 పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌ 35–29తో యూపీ యోధాపై గెలిచింది. 

>
మరిన్ని వార్తలు