టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధనా జన్మదినం (శనివారం) సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. తన అందమైన ఆటతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న మంధాన నేడు 24వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్తో పాటు ఓపెనర్ శిఖర్ ధావన్ పలువురు క్రికెటర్లు ఆమెకు ట్విటర్ వేదికగా విషెస్ తెలిపారు.
‘పుట్టినరోజు శుభాకాంక్షలు మంధనా స్మృతి. ఆటలో ఇలాగే రాణించడం కొనసాగించాలి. భారత జట్టులో ఎడమచేతి వాటం గల బ్యాట్స్మెన్ చాలా ఖ్యాతిని కలిగి ఉంది. ఇదే స్ఫూర్తిని కొనసాగించండి’ అని యువరాజ్ సింగ్ ట్వీట్ చేశాడు. ‘ఎంతో ప్రతిభావంతులైన మంధనాకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు ఎక్కువ పరుగులు, ఎక్కువ శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నా. మీకు ఈ ఏడాది చాలా గొప్పగా ఉండాలని కోరుకుంటున్నా’’ అని పేసర్ భువనేశ్వర్ కుమార్ ట్విటర్ ద్వారా విషెస్ తెలిపారు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా బ్యాట్ వింత్ టాలెంట్ ప్లేయర్ అంటూ సోషల్ మీడియాలో అభిమానులు పోస్టులు పెడుతున్నారు.
కాగా ఇప్పటివరకు 51 వన్డే మ్యాచ్లు ఆడిన మంధాన 43.1 సగటుతో 4 సెంచరీలు చేసి 2025 పరుగులు సాధించారు. వన్డేల్లో వేగంగా 2వేల పరుగుల మైలురాయిని చేరుకున్న మహిళా క్రికెటర్గా రికార్డు నెలకొల్పారు. 75 టీ20 మ్యాచ్లు ఆడి 25.2 సగటుతో 1716 పరుగులు రాబట్టారు. అంతేకాకుండా 2018లో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బీసీసీఐ) ఆమెను ఉత్తమ మహిళా అంతర్జాతీయ క్రికెటర్గా పేర్కొంది. 2018లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆమెకు ఉత్తమ మహిళా క్రికెటర్గా రాచెల్ హేహో-ఫ్లింట్ అవార్డును ప్రధానం చేసింది. ఇదే సమయంలో ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా కూడా ఎంపికయ్యారు.