క్రికెటర్ యువరాజ్ సింగ్ స్వచ్ఛంద సంస్థ ‘యువీ కెన్’ కొత్తగా వస్త్ర ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకు వస్తోంది. దీని ప్రచారం కోసం శనివారం ముంబైలో ప్రత్యేక ఫ్యాషన్ షోను నిర్వహించారు.
సహచర క్రికెటర్లు రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్, ఇషాంత్ శర్మ, గేల్, బ్రేవోలతో పాటు ఇతర క్రీడాకారులు సుశీల్ కుమార్, శ్రీజేశ్ ర్యాంప్పై నడిచి తమ మద్దతు పలికారు. బాలీవుడ్ తారలు అమితాబ్, దీపికా పడుకోన్, కాజోల్, ఫరాఖాన్, హాజెల్ కీచ్ కూడా పాల్గొనడంతో కార్యక్రమ వేదిక మెరిసిపోయింది.