యువీ భారీ సెంచరీ.. వోహ్రా డబుల్

29 Oct, 2016 20:42 IST|Sakshi
యువీ భారీ సెంచరీ.. వోహ్రా డబుల్

న్యూఢిల్లీ: ఫామ్లోలేని భారత ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అజేయ భారీ సెంచరీతో చెలరేగగా, మనన్ వోహ్రా అజేయ డబుల్ సెంచరీ చేశాడు. రంజీ ట్రోఫీ గ్రూప్-ఎలో భాగంగా బరోడాతో మ్యాచ్లో పంజాబ్ తరఫున బరిలోకి దిగిన యువీ (179), వోహ్రా (201) అద్భుతంగా ఆడారు.

ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో బరోడా 529 పరుగులు చేసింది. మ్యాచ్ మూడోరోజు శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పంజాబ్ 452/2 స్కోరు చేసి దీటైన సమాధానం ఇచ్చింది. యువీ, వోహ్రా అజేయంగా 314 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పంజాబ్ తొలి ఇన్నింగ్స్లో ఇంకా 77 పరుగులు వెనుకబడివుంది.
 

మరిన్ని వార్తలు