కాన్పూర్: భారత క్రికెట్ జట్టు ఐదు వందల టెస్టు మ్యాచ్ను పురస్కరించుకుని ఆటగాళ్ల అరుదైన గౌరవంలో భాగంగా ప్రకటించిన డ్రీమ్ టెస్టు ఎలెవన్ జట్టులో ప్రస్తుత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి స్థానం లభించకపోవడంతో అది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. టెస్టు యావరేజ్లో విరాట్ మెరుగ్గా ఉన్నా స్థానం దక్కకపోవడంపై పలువురు విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా, డ్రీమ్ టెస్టు ఎలెవన్ జట్టులో యువరాజ్ సింగ్ కు 12వ ఆటగాడిగా స్థానం కల్పించారు. ఇక్కడ యువరాజ్ కంటే కోహ్లి సగటు బాగుండటమే చర్చకు దారి తీసింది.
2012లో చివరిసారి టెస్టు మ్యాచ్ ఆడిన యువరాజ్ ఈ ఫార్మాట్లో 33.92 యావరేజ్ తో ఉండగా, విరాట్ కోహ్లి టెస్టు యావరేజ్ 45.06 గా ఉంది. దాంతో పాటు ఈ టీమ్లో భారత అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడైన సౌరవ్ గంగూలీకి కూడా చోటు లభించలేదు. భారత జట్టుకు దూకుడు నేర్పిన గంగూలీ తన టెస్టు కెరీర్లో 116 మ్యాచ్లు ఆడటంతో పాటు 16 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. అతని టెస్టు యావరేజ్ 42.17 గా ఉంది. దాంతో పాటు 32 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇదిలా ఉంచితే క్రికెట్ ఆస్ట్రేలియాకు సంబంధించి ఉత్తమ భారత జట్టులో గంగూలీ స్థానం దక్కగా, విరాట్ కు ఇందులో కూడా స్థానం లభించలేదు. ఈ రెండు జట్లకు మహేంద్ర సింగ్ ధోనినే కెప్టెన్ గా ఎంపిక చేశారు.
గతవారం డ్రీమ్ టెస్టు జట్టును ప్రకటించిన భారత క్రికెట్ కంట్రలో బోర్డు(బీసీసీఐ).. తాజాగా వారికి ఓటింగ్ను నిర్వహించింది. ఈ మేరకు భారత డ్రీమ్ టెస్టు ఎలెవన్ కు నిర్వహించిన క్రికెట్ అభిమానలు ఓటింగ్లో రాహుల్ ద్రవిడ్ అత్యధికంగా 96శాతాన్ని దక్కించుకున్నాడు. ఆ తరువాత స్థానాల్లో అనిల్ కుంబ్లే(92శాతం), కపిల్ దేవ్(91 శాతం), ఎంఎస్ ధోని(90శాతం)లు ఉన్నారు. కాగా ఈ ఓటింగ్ లో సచిన్ టెండూల్కర్కు 73 శాతం ఓటింగ్ రాగా, వీరేంద్ర సెహ్వాగ్ 86 శాతం సాధించాడు. అయితే స్టైలిష్ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ 58 శాతం ఓటింగ్తో 12వ ఆటగాడిగా ఎంపికైన యువరాజ్ సింగ్(62శాతం) కంటే వెనుక ఉండటం గమనార్హం.
భారత జట్టు అత్యుత్తమ డ్రీమ్ టెస్టు జట్టు ఇది: ఎంఎస్ ధోని(కెప్టెన్), సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ, కపిల్ దేవ్, రవి చంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్, జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్(12వ ఆటగాడు
Here are the results of India's #DreamTeam as per fan votes #500thTest pic.twitter.com/RgnrBhwLBw
— BCCI (@BCCI) 26 September 2016