యువీ ఐపీఎల్‌ ప్రాక్టీస్ షురూ

15 Mar, 2019 13:11 IST|Sakshi

ముంబై: ఈ సీజన్‌ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున బరిలోకి దిగుతున్న టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ తన నెట్‌ ప్రాక్టీస్‌ను షురూ చేశాడు.  ముంబై ఇండియన్స్‌ హోం గ్రౌండ్‌ వాంఖేడే స్టేడియంలో ఆ జట్టు ప్రాక్టీస్‌కు సిద్ధమైన తరుణంలో యువరాజ్‌ సింగ్‌ సైతం కాసేపు ప్రాక్టీస్‌ చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ వేలంలో యువరాజ్‌ సింగ్‌ను ఏ జట్టు కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోగా, చివరి నిమిషంలో ముంబై ఇండియన్స్‌ అతన్ని కనీస ధరకే దక్కించుకుంది.

గతేడాది కింగ్స్‌ పంజాబ్‌ తరఫున ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన యువరాజ్‌ సింగ్‌ 65 పరుగులు మాత‍్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. దాంతో ఈ ఏడాది అతన్ని జట్టులో కొనసాగించే సాహసం కింగ్స్‌ పంజాబ్‌ ఫ్రాంచైజీ చేయలేదు. ఈ క్రమంలోనే వేలానికి వచ్చిన యువీపై ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి కనబరచలేదు. కాగా, చివర్లో అతని కనీస ధర కోటి రూపాయలకే ముంబై ఇండియన్స్‌ కొనుగోలు చేసింది.

మరిన్ని వార్తలు