ఢాకా: జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్కు తొలి ఇన్నింగ్స్లో 218 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. ఓవర్నైట్ స్కోరు 25/1తో మంగళవారం ఆట కొనసాగించిన జింబాబ్వే 304 పరుగులకే పరిమితమైంది. మిడిలార్డర్ బ్యాట్స్మన్ బ్రెండన్టేలర్ (194 బంతుల్లో 110; 10 ఫోర్లు) శతకం బాదగా, ఓపెనర్ బ్రయాన్ చరి (53), లోయరార్డర్లో పీటర్ మూర్ (114 బంతుల్లో 83; 12 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలు చేశారు.
గాయం కారణంగా చటారా బ్యాటింగ్కు దిగలేదు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లామ్ (5/107) వరుసగా మూడో ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్ను 522/7 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉంది.