25 ఓవర్లలో జింబాబ్వే స్కోరు 97/2

14 Jul, 2015 18:35 IST|Sakshi

హరారే: టీమిండియాతో జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో జింబాబ్వే 25 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. 277 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన జింబాబ్వే ఆదిలోనే మసకజ్జా(7) వికెట్ ను కోల్పోయింది. అనంతరం చిబాబా(47) మరోసారి ఆకట్టుకున్నాడు. గత మ్యాచ్ లో హాఫ్ సెంచరీ ఆకట్టుకున్న చిబాబా ఈ మ్యాచ్ లో కూడా నెమ్మదిగా స్కోరు బోర్డును ముందుకు తీసకువెళుతున్నాడు.

 

టాస్ ఓడిన జింబాబ్వే.. తొలుత టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో భారత్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 276 పరుగులు చేసింది. ఇప్పటికే  సిరీస్ గెలిచిన టీమిండియాకు ఇది నామ మాత్రపు మ్యాచ్. అయినా ఈ మ్యాచ్ ను గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తుండగా.. ఒక మ్యాచ్ లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని జింబాబ్వే యోచిస్తోంది.

>
మరిన్ని వార్తలు