స్కాట్లాండ్ విజయలక్ష్యం 148

10 Mar, 2016 16:54 IST|Sakshi

నాగ్ పూర్: వరల్డ్ టీ 20లో భాగంగా ఇక్కడ గురువారం గ్రూప్-బిలో స్కాట్లాండ్తో జరుగుతున్న క్వాలిఫయింగ్ మ్యాచ్లో జింబాబ్వే 148 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే ఆదిలోనే సిబందా(4), కెప్టెన్ మసకద్జ(12)ల వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. కాగా, సీన్ విలియమ్స్ (53),  ముతాంబమి(19)లు ఇన్నింగ్స్ ను చక్కదిద్దడంతో తేరుకుంది.

 

చివర్లో వాలర్ (13) చిగుంబరా(20)లు ఓ మోస్తరుగా ఆడటంతో జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. స్కాట్లాండ్ బౌలర్లలో ఇవాన్స్, వాట్, షరిఫ్లు తలో రెండు వికెట్లు సాధించారు.

మరిన్ని వార్తలు