ట్రైబల్‌ వెల్ఫేర్‌ డీఈఈ ఇంటిపై ఏసీబీ దాడి

29 Dec, 2017 11:16 IST|Sakshi

శ్రీకాకుళం: జిల్లాలోని సీతం‌పేట ఐ.టి.డి.ఏ పరిధిలోని పాతపట్నం ట్రైబల్‌ వెల్ఫేర్‌ డీఈఈ బలివాడ కృష్ణకుమార్ ఇళ్లపై అవినీతి నిరోధక శాఖాధికారులు దాడులు నిర్వహించారు. శ్రీకాకుళంలోని ఆయన స్వగృహంలో, సీతం‌పేట కార్యాలయంలో, రాజాంలోని ఆయన బంధువుల ఇంట్లో సోదాలు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏకకాలంలో ఆరుచోట్ల అధికారులు తనిఖీలు చేశారు. రూ.2 లక్షల నగదు, రాజాంలో 9 ప్లాట్లు, వైజాగ్‌లో 1 ఫ్లాట్‌ను గుర్తించారు.

మరిన్ని వార్తలు