మేడ్చల్ : మేడ్చల్ జిల్లా శామిర్ పేట్ మండలం తుర్కపల్లి వద్ద గురువారం ఉదయం కారు, బైక్ ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాయపడిన వ్యక్తిని 108 లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ముందు వెళుతున్న ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. శామీర్పోట పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.