-11 బస్సులు సీజ్
హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులను ఎప్పటికప్పుడు ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తున్నప్పటికీ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాల తీరు మారటం లేదు. సరైన పత్రాలు లేకుండా, లెసైన్స్ లేని డ్రైవర్లు తో ట్రావెల్స్ బస్సులను నడుపుతున్నారు. ఆర్టీ కమిషనర్ ఆదేశాల మేరకు ఎల్బీ నగర్లో శుక్రవారం అధికారులు తనిఖీలు చేపట్టారు. సుమారు 100 ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు. అందులో 11 బస్సులకు సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేశారు. టాక్స్ చెల్లించని బస్సులకు జరిమానాలు విధించారు.