చింతపల్లి: విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలం లంబసింగి ఘాట్రోడ్డులో ప్రమాదం జరిగింది. లంబసింగి నుంచి నర్సీపట్నం వెళ్తున్న ఓ ఆటో గురువారం బోల్తాపడింది. ఈ ఘటనలో 14 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్సనిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి త రలించారు.