సురేంద్రపురి వద్ద రోడ్డు ప్రమాదం

12 Nov, 2016 15:13 IST|Sakshi
సురేంద్రపురి వద్ద రోడ్డు ప్రమాదం
- 15 మందికి తీవ్ర గాయాలు
 
భువనగిరి: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన యాదాద్రి జిల్లా భువనగిరి మండలం సురేంద్రపురి వద్ద శనివారం చోటు చేసుకుంది. యాదగిరిగుట్టకు వెళ్లే దారిలో ఉన్న సురేంద్రపురి వద్ద తుఫాన్, స్కార్పియో వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు 108 సాయంతో క్షతగాత్రులను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 
మరిన్ని వార్తలు