సాక్షి, బెంగుళూరు: ప్రేయసి కోసం ఓ యువకుడు సరికొత్త పంధా ఎన్నుకున్నాడు. తాను ప్రేమించిన యువతిని లాంగ్రైడ్ తీసుకెళ్లడం కోసం వరుస దొంగతనాలకు పాల్పడ్డాడు. ఇతనికి మరో యువకుడు వ్యక్తి జత అయ్యాడు. ఇంక ఏముంది హైఎండ్ బైకులు కనిపిస్తే చాలు మాటు వేయడం మాయం చేయడం అలవాటు చేసుకున్నారు. బైక్ చోరీల్లో పోలీసులకు చుక్కలు చూపించిన దొంగలు ఎట్టకేలకు చిక్కారు.
శరబండేపాల్యకు చెందిన వసీం అక్రం తన ప్రేయసిని తిప్పడానికి ఖరీదైన, హైఎండ్ బైకులను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడేవాడు. గత ఏడాది నుంచి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే తనకోసమే బైకులు చోరీ చేస్తున్నాడని అతని ప్రియురాలకి మాత్రం తెలియదు. తరచూ వేరు వేరు బైక్ల మీద వచ్చే అతను, బైక్ గురించి అడిగితే స్నేహితులది అని చెప్పేవాడు. తరచూ బైకులు పోతున్నాయనే సమాచారం తెలసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వసీం దగ్గర నుంచి 16 హైఎండ్ బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే బెంగుళూరు, రాజిగుడ్డకు చెందిన రంజిత్ ఇలాంగవన్ అలియాస్ వందేళ్ అతని స్నేహితుడు మరిముత్తు మునిస్వామి అలియాస్ బైక్రాజాలు 2015లో డిగ్రీ మానేశారు. గత రెండేళ్ల నుంచి నిందితులు 25 బైకులను చోరీ చేశారు. ఇటీవల జయనగర్లోని నాలుగవ బ్లాక్ వద్ద అనుమానాస్సదంగా తిరుగుతున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితులు ఖరీదైన బైకులు చోరీచేసిన అనంతరం రేసింగుల్లో పాల్గొని, తరువాత వాటిని ఎక్కడో చోట వదిలేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.