గుంటూరు : నగరంలోని శ్రీనగర్లో పేకాటస్థావరంపై శనివారం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 16 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. లక్షా 16 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.