పాముకాటుకు ఇద్దరు చిన్నారుల మృతి

3 Dec, 2016 12:30 IST|Sakshi
పెద్దమందడి: వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులు పాముకాటు కారణంగా ప్రాణాలు కోల్పోయారు. పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామానికి చెందిన రాములు కుటుంబసభ్యులు శుక్రవారం రాత్రి తమ గుడిసెలో నిద్రపోతుండగా అర్థరాత్రి రాములు కుమార్తె సవరమ్మ(ఏడాదిన్నర), బంధువుల కుమారుడైన మాసయ్య(10)ను పాముకాటుకు గురయ్యారు. నురగలు కక్కుతున్న చిన్నారులను గమనించిన రాములు ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందారు.
మరిన్ని వార్తలు