చెరువులో పడి ఇద్దరు బాలల మృతి

6 Oct, 2016 11:34 IST|Sakshi
సిరివెళ్ల: కర్నూలు జిల్లా సిరివెళ్ల మండల కేంద్రంలోని నాగుల చెరువులో పడి ఇద్దరు బాలలు మృతి చెందారు. మృతులు మడిమెల ప్రసాద్(17), కామిని వేణుగోపాల్(12)గా గుర్తించారు. గేదెలు మేపటానికి వెళ్లినపుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన నిన్న జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
మరిన్ని వార్తలు