సైదాపూర్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం అమ్మనగుర్తిలో ట్రాక్టర్ - లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పత్తిపాక నారాయణ, గోనెల రాజయ్య అనే ఇద్దరు మృతి చెందారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.