ఆర్టీసీ బస్సు, లారీ ఢీ: ఇద్దరి మృతి

23 Feb, 2017 15:54 IST|Sakshi
గంగవరం: చిత్తూరు జిల్లా గంగవరం మండలం కల్లుపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మదనపల్లి నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్‌, బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికురాలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వార్తలు