చేబ్రోలు: బావిలో పడిన స్నేహితుడిని కాపాడే క్రమంలో మరో బాలుడు కూడా బావిలో పడి ప్రాణాలొదిలాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వెంజడ్ల గ్రామంలో బుధవారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ఎస్కే బహదూర్ ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడ్డాడు. ఇది గుర్తించిన ఎస్కే గౌస్ అలీ అతన్ని కాపాడే క్రమంలో బావిలో పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.