రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

15 Nov, 2016 16:25 IST|Sakshi
చేజెర్ల: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చేజెర్ల మండలం అదూరుపల్లి సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. కలువాయి వైపు నుంచి వస్తున్న ఆటో ఎదురుగా వస్తున్న బైక్ ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటోలో ఉన్న మహేష్(5)తో పాటు బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే పొదలకూరు ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా చిన్నారితో పాటు, ఓ వ్యక్తి చనిపోయాడు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో పొదలకూరు నుంచి నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు
మరిన్ని వార్తలు