విద్యుత్‌ తీగలు తెగిపడి ఇద్దరు మృతి

28 Feb, 2017 12:25 IST|Sakshi
నిడదవోలు: పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండలంలోని తాడిమళ‍్ల గ్రామ శివారులో 33 కేవీ విద్యుత్‌ తీగలు తెగిపడి ఇద‍్దరు మహిళా కూలీలు మృతి చెందారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. తాడిమళ్ల దగ్గర పొలం పనుల కోసం మహాలక్ష్మి,(38),  వల‍్లంకి మంగ (23) అనే ఇద్దరు మహిళలు పొలంలో పనులు చేస్తుండగా పైనున‍్న 33 కేవీ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఈ సంఘటనలో వారిద‍్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మహిళల మృతిపై బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మరిన్ని వార్తలు