20 మంది నిట్ విద్యార్థినులకు అస్వస్థత

24 Dec, 2016 16:45 IST|Sakshi
వరంగల్: వరంగల్ నిట్‌లో కలుషిత ఆహారం తిని 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అస్వస్థతకు గురైన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని రోహిణి ఆస్పత్రికి తరలించారు. 20 మంది నిట్ విద్యార్థినులు రెండు రోజుల క్రితం క్షిద్ర అనే హోటల్‌లో చికెన్ బిర్యాని తిన్నారు. దీంతోనే వారికి ఫుడ్‌పాయిజన్ అయి వుంటుందని తోటి విద్యార్థినులు చెబుతున్నారు. 
మరిన్ని వార్తలు