విస్తరిస్తున్న కోతి జ్వరం

18 Apr, 2020 09:38 IST|Sakshi

కర్ణాటక,బనశంకరి: రాష్ట్రంలో ఓవైపు కరోనా విజృంభిస్తుండగా మరో వైపు కోతి జ్వరం చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు ఈ వ్యాధి రాష్ట్రంలోని 12 జిల్లాలకు వ్యాపించింది. సుమారు 200 కేసులు నమోదయ్యాయి.  గత ఆదివారం ఉత్తరకన్నడ జిల్లా సిద్దాపుర తాలూకాలోని కూలర్క గ్రామంలో 41 కేసులు వెలుగుచూశాయి. చిక్కమంగళూరులో 10, శివమొగ్గ జిల్లాలో 146 కేసులు వెలుగు చూశాయి. (ఇండియన్‌ నేవీలో కరోనా కలకలం!)

మరిన్ని వార్తలు